నిజామాబాద్ అర్బన్
నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు భేష్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, జిల్లా ప్రత్యేక అధికారి శరత్ అధికారులతో మాట్లాడారు. జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యలు భేషుగ్గా ఉన్నాయని అన్నారు. ఈ నెలలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.