పుంగనూరు
ఆరుగురు జూదరులను అరెస్ట్ చేసిన పోలీసులు
జూదమాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు సీఐ రాఘవరెడ్డి గురువారం రాత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరు మండల పరిధిలోని ప్రసన్నయ్య గారిపల్లి గ్రామ సమీపంలోని పొలాల వద్ద చింత చెట్టు కింద జూదం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు ఎస్సై మహమ్మద్ రఫీ తన సిబ్బందితో దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరు మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ. 4, 150 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.