గిద్దలూరు
20 కుటుంబాలు టిడిపిలో చేరిక
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో శనివారం 20 కుటుంబాలు టిడిపిలో చేరాయి. గిద్దలూరు పట్టణంలోని ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ కు చెందిన 20 కుటుంబాలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నాయి. 2024 ఎన్నికలలో ముత్తుముల అశోక్ రెడ్డిని గెలిపించుకునేందుకు తమందరం కృషి చేస్తామని పార్టీలో చేరిన కార్యకర్తలు అన్నారు.