ఒంగోలు
రేపు పోస్టల్ ఏజెంట్ల జిల్లా సదస్సు
జిల్లాస్థాయి పోస్టల్ ఏజెంట్ల అసోషియేషన్ జిల్లా సదస్సు ఆదివారం ఒంగోలులో నిర్వహిస్తున్నట్లుగా జిల్లా సేవింగ్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్. దరియా సాహెబ్ శనివారం తెలిపారు. ఒంగోలు రాంనగర్ లో ఉన్న రైస్ మిల్ అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోస్టల్ అధికారి ఎండి. జాఫర్ సాదిక్ హాజరవుతారన్నారు.