గిద్దలూరు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ప్రకాశం జిల్లా కంభం మండలం ఎర్రబాలెం గ్రామ సమీపంలో బుధవారం ఆటో అదుపుతప్పి బోల్తాబడ్డ సంఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ముగ్గురిని 108 వాహనంలో కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు అందరూ గిద్దలూరులో అశోక్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి అర్ధవీడుకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.