నగరి
రోజాను అత్యధిక మెజార్టీతో గెలిపించండి: సీఎం జగన్
పుత్తూరు పట్టణంలో జరిగిన రోడ్ షోలో శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన చెల్లి రోజాను గెలిపించాలని కోరారు. అప్పుడప్పుడు రోజా మాట కటువుగా ఉంటుందని మనసు మాత్రం వెన్న అన్నారు. ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప పాల్గొన్నారు.