వేమూరు
వెల్లటూరు గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం
భట్టిప్రోలు మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలో శనివారం వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరి కూటి అశోక్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జున రావు, పార్టీ వివిధ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.