భూపాలపల్లి
అడవి రక్షణ అందరి బాధ్యత
అడవిని రక్షించుకోవడం అందరి బాధ్యత అని భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ ఎఫ్డి ఓ వజ్రారెడ్డి అన్నారు. పలిమెల రేంజ్ సౌత్ జోన్ బీట్ బోడాయిగూడెం పరిధిలోని అడవికి కార్చిచ్చు అంటుకోగా ఎఫ్డి ఓ వజ్రారెడ్డి, ఎఫ్ఆర్వో వెంకటేశ్వరరావు సమక్షంలో మంటలను అదుపు చేశారు. దీంతో మహాముత్తారం మండలం యత్నారం, నిమ్మగూడెం, పెగడపల్లి సౌత్ బీట్లలో కూడా అటవీకి అంటుకున్న మంటలను ఆర్పి వేసినట్లు బుధవారం తెలిపారు.