ఉమ్మడి వరంగల్ జిల్లా - Warangal

వీడియోలు


తెలంగాణ
మోడీ ప్రధాని అవడం ఖాయం : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి
May 02, 2024, 15:05 IST/

మోడీ ప్రధాని అవడం ఖాయం : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి

May 02, 2024, 15:05 IST
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావటం ఖాయమని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు లోక్ సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. దేశాభివృద్ధి బీజేపీతో సాధ్యమన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి దేశ వ్యాప్తంగా 400 సీట్లు రావటం ఖాయమన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేసిన బీజేపీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రజలను మభ్య పెట్టేందుకు వస్తుందని, వారి మాటలు నమ్మొద్ద న్నారు. గ్రామాల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని తెలిపారు.